Wednesday, September 22, 2010

ప్రపంచంలో మూడో శక్తివంతమైన దేశం భారత్‌

అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌(ఎన్‌ఐసీ), యూరోపియన్‌ యూనియన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సెక్యూరిటీ స్టడీస్‌ (ఈయూఐఎస్‌ఎస్‌) సంయుక్తంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ జాబితాను విడుదల చేశాయి. ఈ జాబితా ప్రకారం మొదటి రెండు స్థానాలు అమెరికా, చైనాకు దక్కాయి. దీని ప్రకారం గ్లోబల్‌ పవర్‌లో అమెరికా 22 శాతం, యూరోపియన్‌ యూనియన్‌ 16 శాతం, చైనా 12 శాతం, భారత్‌ 8 శాతం వాటా సాధించాయి. 2025 నాటికి చైనా, భారత్‌, బ్రెజిల్‌ మరింత బలోపేతం అవుతాయి. భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచం గుర్తిస్తోందని అనేందుకు ఇది ఒక ఉదాహరణ.