skip to main |
skip to sidebar
వినాయకుని పత్రిపై ఔషధ మొక్కల బోర్డు ప్రచారం
10:37 PM
Vikasa Dhatri
రాష్ట్ర ఔషధమొక్కల బోర్డు గణేశుని పూజకు ఉపయోగించే 21 రకాల ఆకులు, మొక్కల ప్రాధాన్యతపై ప్రచారం చేపట్టింది. ప్రజలకు నిత్య జీవనంలో ఉపయోగపడే ఔషధమొక్కల ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు పూర్వీకులు ప్రవేశపెట్టిన వినాయకునికి పత్రితో పూజ ప్రస్తుతం ప్రాధాన్యాన్ని కోల్పోయింది. ఔషధమొక్కల స్థానంలో విక్రేతలు పిచ్చిమొక్కలు అంటగడుతున్నారు. ఈ పరిస్థితిని తప్పించేందుకు రాష్ట్ర ఔషధమొక్కల బోర్డు నాబార్డు ఆర్థిక సహకారంతో ప్రచారం చేపట్టింది. పూజకు ఉపయోగించే మొక్కల గురించి వివరాలతో పోస్టర్లు ముద్రించి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పూజకు ఉపయోగించే ఆకులు విక్రయించాలంటూ కొందరు వ్యాపారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. విద్యార్థులకు కూడా దానిపై అవగాహన కల్పిస్తున్నారు. అడవికి దగ్గరగా ఉన్న పట్టణాల్లో యువతకు దీనిపై అవగాహన కల్పించి విక్రయాలు చేసేవిధంగా ప్రోత్సహిస్తున్నారు.