skip to main |
skip to sidebar
మంచినీటి విక్రయాలకు ఐ ఎస్ ఐ తప్పనిసరి
10:12 PM
Vikasa Dhatri
భారతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ (బీఐఎస్) ధ్రువీకరణ బాటిళ్లలో విక్రయించే మంచినీటికి తప్పనిసరిగా ఉండాలని కేంద్ర ఆహార శాఖ స్పష్టం చేసింది. మినరల్ వాటర్తో సహా బాటిళ్లలో విక్రయించే అన్ని రకాల మంచినీళ్లకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ''మంచినీటి తయారీ, విక్రయం, ప్రదర్శన - వీటిలో ఏది చేయాలన్నా ఆ నీటికి బీఐఎస్ ప్రమాణాల ధ్రువీకరణ తప్పనిసరి'' అని ఆహారశాఖ పేర్కొన్నది. సాధారణ తాగునీటికి ఐఎస్ 14543:2004 ప్రమాణాలను, మినరల్ వాటర్కు 13428:2005 ప్రమాణాలను పాటించాలని తెలిపింది. మినరల్ వాటర్కు సంబంధించి 18 కంపెనీలకు, రివర్స్ ఆస్మాసిస్ ద్వారా మంచినీటిని విక్రయిస్తున్న సంస్థలకు 2,354 లైసెన్సులు ఉన్నాయని, సహజసిద్ధంగా లభిస్తున్న మంచినీటిని విక్రయించేందుకు 633 లైసెన్సులు ఉన్నాయని పేర్కొంది. ఆహార కల్తీ నిరోధక చట్టం కింద కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.