skip to main |
skip to sidebar
డెంగీకి దోమకాటు!
8:11 PM
Vikasa Dhatri
డెంగీకి దోమకాటు!
ఏడిస్ ఈజిప్టీపై పోరుకు జన్యుమార్పిడి కీటకం కౌలాలంపూర్: ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు డెంగీ వ్యాధిని వ్యాపింపజేసే దోమలను.. దోమలతోనే అంతంచేయాలని మలేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా జన్యుమార్పిడి (జీఎం) చేసిన మగ దోమలను విడుదల చేయబోతున్నారు. అలోర్ గజా, బెంటాంగ్ల ప్రాంతాలను ఇందుకోసం ఎంపిక చేశారు. 4వేల నుంచి 6వేల దోమలను వచ్చే నెలలో విడుదల చేస్తారు. జీఎం దోమలు.. ఆడ దోమలను సంభోగం జరుపుతాయి. వీటికి పుట్టే దోమలు.. లార్వా దశలోనే చనిపోతాయి. ఫలితంగా డెంగీకి కారణమయ్యే ఏడిస్ ఈజిప్టీ దోమల సంఖ్య తగ్గుతుందని అంచనావేస్తున్నారు.