skip to main |
skip to sidebar
బాలకార్మికుల గణనపై 'సుప్రీం' అసంతృప్తి
10:01 PM
Vikasa Dhatri
వెట్టి, బాలకార్మిక వ్యవస్థల నిర్మూలన కోసం అవసరమైన గణనను రాష్ట్రాలు చేపట్టకపోవటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ''ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకు ఈ గణన కోసం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తోంది. ఏ ఒక్క రాష్ట్రామూ దీనిని చేపట్టలేదు'' అని ప్రధాన న్యాయమూర్తి కపాడియా.. న్యాయమూర్తులు కె.ఎస్.రాధాకృష్ణన్, స్వతంతర్ కుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బాల కార్మికులపై సర్వే చేయకపోతే నిధులు ఎందుకు విడుదల చేస్తున్నారని కేంద్రాన్ని ప్రశ్నించింది. తమ ఉత్తర్వులు అమలు చేయకపోతే.. ఆదేశాలు జారీచేయటాన్ని ఆపేస్తామని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెట్టి, బాల కార్మికవ్యవస్థ నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై 1985లో దాఖలైన వ్యాజ్యంపై సుప్రీం విచారణ చేపట్టింది.