Tuesday, October 19, 2010

వాతావరణ మార్పు వల్ల భారత్‌కే అధిక ముప్పు

వాతావరణ మార్పు వల్ల రానున్న 30 ఏళ్లలో అత్యధిక ముప్పు ఎదుర్కొనే దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉందని బ్రిటన్‌కు చెందిన మాప్లెక్రాఫ్ట్‌ సంస్థ తమ సర్వేలో వెల్లడించింది. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్‌ మొదటి స్థానంలో, నేపాల్‌ నాలుగు, పాకిస్థాన్‌ 16, అఫ్గానిస్థాన్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. 170 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో.. ఆసియా ప్రాంతంలోనే వాతావరణం అత్యంత దుర్భరంగా ఉన్నట్లు గుర్తించారు. జనాభా పెరుగుదల వల్ల వరదలు, తుఫాన్లు, అనావృష్టి ఏర్పడుతాయని తెలిపింది. వాతావరణంలో జరిగే స్వల్ప మార్పులు.. మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని పర్యావరణ పరిశోధకుడు అన్నామొస్‌ తెలిపారు. నీటి వసతులు, పంట దిగుబడిపై దుష్ప్రభావం చూపడంతో పాటు సముద్ర మట్టాలు పెరిగి భూభాగాన్ని కోల్పొతామని వివరించారు.