Sunday, July 18, 2010

అఖిల భారత ఫోటోగ్రఫీ పోటీ

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ, ఎన్‌సిఇఆర్‌టి అఖిల భారత ఫోటోగ్రఫీ పోటీలను బాలల కోసం నిర్వహిస్తోంది. 12 నుంచి 18 సంవత్సరాల వయస్సులో వున్న బాలలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎవరైన పోటీల్లో పాల్గొనేందుకు అర్హులే.
పోటీలకు పంపిన అన్ని ఫోటోలను సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తారు. ఉత్తమంగా ఉన్న 100 ఎంట్రీలకు మెరిట్‌ సర్టిఫికెట్‌ను ఇస్తారు.
ఎంట్రీలను పంపించేందుకు చివరి తేదీ 30 సెప్టెంబర్‌ 2010. పోటీలలో పాల్గొనేందుకు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఎంట్రీలను పంపించవలసిన చిరునామా:
జాయింట్‌ డైరెక్టర్‌
సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ టెక్నాలజీ,
ఎన్‌సిఇఆర్‌టి
చాచా నెహ్రూ భవన్‌, శ్రీ అరబిందో మార్గ్‌
న్యూ ఢిల్లీ 110 016