Thursday, November 4, 2010

చంద్రుడిపైకి రోబో

చంద్రుడిపైకి రోబో
లండన్‌: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ-నాసా శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి మరమనిషిని పంపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరో వెయ్యి రోజుల్లో ఈ లక్ష్యాన్ని సాధించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రుడిపై రోబో నడిచే మహత్తర సందర్భం కొత్త తరం శాస్త్రవేత్తలకు ఉత్తేజాన్నిస్తుందని వారు ఆశిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై అధికారికంగా ఆసక్తి లేకపోవడంతో శాస్త్రవేత్తలే స్వయంగా పూనుకుని విచక్షణ నిధుల్ని వాడటమే కాకుండా, ఇంజినీరింగ్‌ కంపెనీల సాయాన్ని తీసుకున్నారు. హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రం ముఖ్య ఇంజినీర్‌ స్టీఫెన్‌ ఆల్టెమస్‌ ప్రత్యేక ఆసక్తితో ఈ ప్రాజెక్టు పట్టాలకెక్కింది. తోటి శాస్త్రవేత్తలను పోగేసి నిధుల కొరత సమస్యను వివరించి, వీలైనంత వేగంగా దీనిని పూర్తి చేయాలనే సంకల్పంతో పనులు సాగిస్తున్నారు.